ఆరుద్ర
మళ్ళీ చాల కాలం తర్వాత జయతి అక్కయ గారి ఫోటో ఆల్బం లో చూసాను ఆరుద్రని. అచ్చమైన ఎరుపువర్ణం లో ఉన్న ఆరుద్రని చూసి చాల కాలమైంది. దాదాపు పదేండ్లు కావస్తుంది.
వేసవి సెలవులు అనే పధం వినపడితే చాలు చిన్నమ్మ వాళ్ళ ఇళ్లు గుర్తొచ్చేది. కొత్తకొండ, ధర్మారం కరీంనగర్ జిల్లాలో ఉండేది వారి ఇళ్లు. ఎండాకాలమే కాదు వర్షాకాలం శీతకాలల్లో కూడా నాలుగైదు రోజులు వెళ్లి గడిపెవాల్లము.
అప్పట్లో ఇప్పటి లాగ ఆటోలు లేవు హన్మకొండ బస్సు స్టాండ్ లో బాపు, అమ్మ, అన్నయ, అక్కయ, నేను అందరం కలిసి ములకనూరు బస్సు ఎక్కేవాళ్ళం.
అక్కడ మొదలైన బస్సు మెల్లిగా కదులుతూ పెట్రోల్ పంప్, నయీం నగర్, కాకతీయ విశ్వవిద్యాలయం దాటిన తర్వాతే వేగం పుంజుకునేది. ఆ కాలంలో బస్సు కిటికే నాకో పెద్ద ఇంటర్నెట్ ఎండకాలమైతే Windows XP వానకలమైతే Windows Vista ఇక ఆ బస్సు కిటికిలోంచి ప్రపంచాన్ని చూడడమే తరువాయి దూరంగ కనిపించే కొండలు, వేగంగ వెనక్కి పరిగెత్తే చెట్లు, ఒక గ్రాఫ్ లో గీతల్లాగా పైకి కిందికి ఊగిసలడుతున్నట్టు తోచే కరెంటు స్థంబాల వైర్లు, మధ్యలో కనిపిస్తున్న ప్రతి వారికి చెయ్యి ఊపుతూ టాటా చెపుతూ సాగే ప్రయాణంతో ఒక గంటలో ములుకనూరు చేరేవాళ్ళం. చుట్టూ పక్కన ఉన్న గ్రామాలన్నిటికీ అదే టౌను.
అక్కడినుండి కొత్తకొండ బస్సు ఎక్కి చుట్టూ ఉన్న సుందర లావణ్యాన్ని చూస్తుండగా చల్లని ఈదురు గాలులకు దీటుగా బస్సు దూసుకుపోతుంటే వెచ్చటి అమ్మ ఒళ్ళో కూర్చొని కిటికీ నుండి చూడగా దూరంగా మంచుతో కప్పబడిన కొండలు ఏదో గ్రామంలో ప్రయనిస్తున్నట్టు కాకా ఊటీ కొడైకెనాల్ కు వెళ్తున్న అనుభూతి కలిగేది(ఇప్పటికిను), మెల్లిగా చినుకులు పడుతుండగా పడిశం పడుతుందని అమ్మ కిటికీ మూసేది. నీటి తుంపర్లతో మసగ్గా మారిన కిటికీ నుండి చూడగా కనిపించే కొండలు వాటిని కప్పుకొని ఉన్న మంచు పొగలు, జోరుగు కురుస్తున్న వర్షం, ఈదురు గాలులకు వంగి పోతున్న చెట్లు, ముద్దైన పంటపొలాలు, అన్ని కూడా, ఓ చిత్రకారుడు గీసిన వర్ణ చిత్రం లాగ తోచేది. అప్పుడప్పుడు తలుక్కున మెరిసే ఆవులు, పొలం చివర్లో గట్టుపైన కట్టుకున్న గుడిసెలు, తడుస్తూ పరుగులు పెడుతూ పొలం బాయిల కాడ నా ఈడు పిల్లలు, మరి వెలుతురుగా కాకా మరి చీకటిగా కాకా మసక వెలుతురులో, అధ్బుతమైన ప్రకృతి అందాలు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక వంద మంది చిత్రకారుల వర్ణ చిత్రాలతో ఏర్పాటు చేసిన అతి పెద్ద సహజ గేలరీ ని చూస్తున్న అనుబూతి ఓ బస్సు కిటికీ ద్వారా కలిగేది.
మెల్లిగ వర్షం తగ్గే సమయానికి కొత్తకొండ కి చేరుకునే వాళ్ళం. ఇక అక్కడినుండి ధర్మారం గ్రామంలోకి వెళ్ళాలంటే ఎర్ర మట్టి రోడ్డు పై నాలుగు కిలోమీటర్లు నడవాల్సిందే. ఇక తడిచి ముద్దైన నేల బాటపై బురద చిల్లకుండ స్లిప్పర్లను బొటన వేలుతో గట్టిగ పట్టుకొని, అన్నయ చూపుడు వేలును ఆసరాగా తీసుకొని నెమ్మదిగ అడుగులు వేస్తూ వెళ్ళేవాళ్ళం. ఇక నేను మాత్రం కుడి వైపుకు ఉన్న పెద్ద పెద్ద కొండలని, గుట్టల చివరని, తల పైకెత్తి చూస్తుంటే, అక్కడికి చేరుకుంటే ఆకాశాన్ని అందుకోవడమే అని అన్నయ చెప్తూ ఉంటె వింటూ నడిచేవాన్ని, ఎడమ వైపు నేల కనపడకుండా పచ్చని పొలాలు, చిన్న చెరువు, చెరువు మొత్తం ఓ frame లాగ ఆకాశం మేఘాలు ఆ frame లో బంది అయి కనులకు ఇంపుగా తోచేది.
ధోతి పైకెత్తుకొని, తలకు రుమాలు చుట్టుకొని, చలి బెట్టకుండా గొంగడి కప్పుకొని, చేతి కర్ర పట్టుకొని, ఆహే ఆహే అంటూ పాతిక గొర్రెలను తోలుకుంటూ ఎదురొచ్చే తాత, పెద్ద సైకిల్ పై గోనే సంచుల మూటలతో లుంగీలు కట్టుకొని ఎదురొచ్చే మధ్యవయసు యువకులు, కూలి పనులకి పోతున్న ఆడవాళ్ళు, ఒక్కొక్కటి ఎదురు పడుతుండగా చూస్తూ వెళ్ళేవాళ్ళం. ఆ నాలుగు కిలోమీటర్ల ప్రయాణంలో కొండలపైనుండి పరుగులు పెడుతున్న కొండెంగా కోతులు, ఎలుగుబంట్లు, పరుగులు పెట్టె కుందేళ్ళు (చిత్రం అవ్వన్నీ ఇప్పుడు డబ్బులు పెట్టి “జూ” కి వెళ్తే తప్ప చూడని పరిస్థితి), బతుకమ్మ పండగలో ఉపోయోగించే, తంగేడ పూలు, సీత జడ పూలు, ఇంకా నాకు పేర్లు తెలియని అందమైన పూలు, నిలువెత్తు జమవాయిలు చెట్లు, మామిడి, జామ, కంకి, వరి, పత్తి, ప్రొద్దు తిరుగుడు పూల తోటలు. అన్ని కూడా నన్ను సాధారముగా ఆహ్వానం పలికేవి, నా మనసు ఎన్నో అవతారలేత్తేది నాలో బిన్న భావాలూ ఒక కవిగా, శాస్త్రవేత్తగా, చిత్రకారునిగా, విశ్లేషకుడిగా, దర్శకుడిగా, ఫోటోగ్రాఫర్ గ, సృష్టి రహస్యాన్ని చేధించాలనే ఓ యోగి ల , జీవిత పరమార్ధం ఈ ప్రకృతిలోనే దాగుందని నమ్మే ఓ సాధువుల ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవతారాలెత్తిధి.
మనసుని చూపుని నాకు సాధ్యమయెంత వరకు ఓ వల లాగ విసిరి ఆ ప్రకృతి దృశ్యాన్ని మొత్తం గుండెల్లో పదిలంగా దాచుకొని మనస్పూర్తిగా ఆనందించే వాణ్ని.
నాలుగు కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ధర్మారం లోకి చేరుకునేవాళ్ళం. ఆ గ్రామం లో మొదటి ఇల్లు మా చిన్నమ్మ వాళ్ళదే. మూడు గదులు గల చిన్న పెంకుటిల్లు ముందు కూర్చోవడానికి గద్దె(అరుగు), నీడకోసం వేసిన పందిరి దానికి అల్లుకొని పెరుగుతున్న బటాణి పూల చెట్టు, మూడు గదులు కూడా ఎర్రమన్నుతో అలికి ముగ్గులు పెట్టి ఎప్పుడు శుబ్రంగ ఉంచుతుంది చిన్నమ్మ(శుబ్రత విషయంలో మా చిన్నమ్మ తీసుకొనే జాగ్రత్తలు అంత ఇంత కాదు). ఇంటి వెనకాల విశాలమైన ప్రదేశం మధ్యలో అతి పెద్ద చింత చెట్టు ఆ ఇంటి మొత్తాన్ని ఓ గొడుగుల తన కౌగిల్లోకి తీసుకొని కాపాడుతున్నట్టు ఉంటుంది. ఓ మూలన దాదాపు ఏడెనిమిది బొప్పాయీ చెట్లు, రెండు జామ చెట్లు, నిమ్మ చెట్టు, కాయగూరల మొక్కలు, కనకాంబరం, సీత జడ పూల మొక్కలు, ఇంకా కంద మొక్కలు, పాలకూర, బచ్చలి, చిక్కుడు మొక్కలు ఉండేవి. ఎప్పుడు ఇంట్లో కుటుంబ సబ్యుల్లా మెదిలే చిట్టి పిల్లి కూనలు(రెండు ముద్దల పెరుగన్నం పెడితే తినేసి ఇంట్లో ఓ మూలాన సేద తీరేవి), కోడి పుంజులు, పదికి పైన కోళ్ళు.
అప్పట్లో సైకిల్ అద్దెకిచ్చే షాపు నడిపించేవాడు బాబాయ్, గ్రామం లో అందరికిను మాట సాయం, చేత సాయం చేస్తూ ఏదైనా గొడవలు సమస్యలు గ్రామం ప్రజల్లో కలిగితే న్యాయ నిర్ణేత (పెద్దమనిషి) గ వ్యవహరించేవాడు.
ఇంట్లోకి చేరుకోగానే చిక్కటి మజ్జిగ తాగి చింత చెట్టు కింద ఎవరికీ నచ్చిన చోట వారు చాపలు పరుచుకొని సేద తీరుతుంటే, చింత చెట్టు కాడా మట్టి పోయ్యిలోనే వంటలన్నీ కూడా దానికి అనుకోని పక్కనే రోలు రోకలి(రోకలి తో ఉన్న అనుబంధం అంత ఇంత కాదు), ఇక నేను బయటికొచ్చి, ఎదురుగా ఉన్న రెండెకరాల పొలంలోకి వెళ్ళే వాణ్ని వెళ్లిన ప్రతిసారి రకరక ల పంటలు పత్తి, మొక్క జొన్న, కంది, ప్రొదు తిరుగుడు, బాబ్బెర్లు పండించేవారు నాకు మాత్రం ప్రొద్దు తిరుగుడు, కంది, బాబ్బెర్ల పంటలంటే మరి ఇష్టం. ఆ పొలం లో ఎంత సేపు గడిపిన తక్కువే అనిపిస్తుంటుంది. ఆ పొలం ధాటి మట్టి దారిని ధాటి వేరే పొలం గట్ట్లపైనుండి నడుస్తూ వెళితే కనిపిస్తుంది పెద్ద ఊడల మర్రి చెట్టు, అక్కడ ఊడలు చేత పట్టి ఊయల ఊగే ప్రయత్నం చేసే వాణ్ని, ఆ మర్రి చెట్టు మొదల్లో కనిపించేవి ప్రదేశమంత మహారాజుల్ల మహారానిల్ల పాలిస్తున్నట్టుగ ఆరుద్ర పురుగుల గుంపు, చాల సార్లు చేతిలోకి తీసుకొనే ప్రయత్నం చేశాను కాని ధైర్యం చాలలేదు. ఎత్తు వంపులను ఎక్కుతూ థిగుతూ, ఒక దాని వెంబడి ఒక్కొక్కటి రైలు బోగిల్ల వెళ్తుండడం భలే ముచ్చటేసేది. ఆ గ్రామం లో గడిపిన రోజుల్లో ప్రతి రోజు ఆరుద్ర పురుగుల రాజ్యానికి వెళ్లి వచ్చేవాడిని. ఆరుద్ర రాజ్యాన్ని అనుకొనే పెద్ద నల్ల చీమల రాజ్యం, దానికి కొంచెం దూరం లో ఉన్న పిచ్చి మొక్కలను ఆసరాగా తీసుకొని జీవనం సాగిస్తున్న బంగారు పురుగులు, అలా కొంచెం తల పైకెత్తి చూస్తే కనిపించే తేనె తెట్ట ల మహేలు, ఒక వందకు పైగా సంగీతాలు వాయించే పిచుకలు వాటి గూళ్ళు, అప్పుడప్పుడు వినిపించే కోయిల స్వరం, ఊడల మధ్యలనుండి సింధూరం పూసుకొని సిగ్గుతో తలదించుకొని అస్తమిస్తున్న సూర్య బింబం, గాలి విచినప్పుడల్లా పసుపువర్నంలోకి మారి రాలుతున్న ఆకులు, ఇలా ఓ అధ్బుత సుందర లోకం లోకి అతిధిగా వచ్చిన నా మనసుకు ప్రతిరోజు సేవ చేసేది ఆ ప్రాంతం అంత. ఇదే తంతు ప్రతి రోజు ఒక్కోరోజు ఉదయాన్నే వేల్లెవాన్ని ఒక జేబులో వేయించిన పల్లీలు, మరో జేబులో, వేయించిన శనగలు, చేతిలో మొక్కజొన్న పాలేలు, అలా తినుకుంటూ అక్కడికి చేరుకొనే వాణ్ని, అపుడే ఉదయిస్తున్న సూర్యుని కిరణాలూ, పంట పొలాలపై ప్రతి చిన్న ఆకును కూడా వదలకుండా పడేది. జివ్వుమని తగిలిన సూర్యకిరణం ప్రతి ఆకును మేలుకోల్పేది. ఆకూపై సేదతీరుతున్న చిన్న చిన్న నీటి బిందువులు పై పడుతున్న సూర్యకిరణం తో ఉత్తేజితమై వజ్రపు రంగులోకి రూపాంతరం చెందేది. అదంతా గమనిస్తున్న నేను నా మనసు కెమరాలో బంధించుకునే వాణ్ని. హమ్మయ్య లేగండ్రా అనుకుంటూ ఆరుద్ర పురుగులు బయటికోచ్చేవి తమ రాజ్యంలో ఉన్న మిగతా పురుగులతో ఆ సమయంలో వాటి రంగు మరింత తేజోమయమై ఉండేధి.
కొంత కాలం తర్వాత నా జేబులోకి డిజిటల్ కెమరా వచ్చి చేరాక ఆ ఆరుద్ర కోసం నాలుగు రోజులు వెతికాను. ఈ అతిధి మీద కోపం పెంచుకున్నాయేమో లేక మరే కారణమో కాని కాలంతో పాటు జరిగిన మార్పులతో మర్రి చెట్టు, ఆ ఆరుద్రలు, పక్షుల గూళ్ళు, కాలంలోనే మాయమయ్యాయి. ఏమో ఏదో తెలియని అనుబంధం ప్రక్రుతితోనో లేక బావాలతోనో, లేక నాలోనే దాగిన నాతోనో ఏమో ఎవరికీ చెప్పుకోలేని ఓ వింత వేదనకి గురయ్యాను అవి కనపడక పోవడంతో. చెప్పాలంటే ఆ గ్రామం లో నేను చుసిన ప్రతి అంగుళం కూడా నా మనసు వాటికి మాత్రమే తెలిసే బంధం ఏర్పరుచుకున్నది. ఒక్కో చోటు ఒక్కో పుస్తకమై మనసు లైబ్రేరి లో దుమ్ముపట్టకుండా పదిలంగా దాచుకున్న.
పదిహేను సంవత్సరాల్లోనే అభివృద్ధి పేరుతో మనుషుల మధ్యన జరుగుతున్న మార్పులు ఆ గ్రామాన్ని కూడా చుట్టుముట్టాయి. ఇది కొత్తేం కాదు నేను ఊహించిందే అయిన జంతు సంరక్షణ పేరుతో కనిపించిన ప్రతి మూగ జీవిని లాక్కెళ్ళి పోయారు, కొన్ని వందల నెమల్లు, కొండెంగ కోతులు, కుందేళ్ళు, ఎలుగుబంట్లు, ఒకటి రెండు చిరుతలు, వందల్లో వింత వింత పాములు. ఇలా చెప్పుకుంటూ పోతే తమ తమ రాజ్యాలని కొల్లోగోట్టిన మహానుభావులము మన మానవులమే అని చెప్పుకోవడంలో ఏమాత్రం సిగ్గుగా లేదు.
ఆ గ్రామా ప్రజలందరికీ రాజకీయ గుర్తింపు లబించింది. ఇక రాజీకయ అనుబవగ్నులకి ప్రజలంతా ఉపయోగ పడడం మొదలయింది. పంటలను తగ్గించి, కొల్ల ఫారాలు( పెద్ద మొత్తం లో వచ్చిన నష్టం ఏ ప్రబుత్వం బరించలేక పోవడం తో వారి నెత్తినే భారం వేసుకొని రైతన్నల మేడలు వంగి పోవడం జరిగింది), పొగాకు బిడిలా సెగ ప్రతి పాలిచ్చే మహిళను కూడా పనిలోకి దింపింది. చైతన్యం పేరుతో గ్రామా దేవతల పండుగలు, ఎడ్లబండ్లపై కొత్తకొండ జాతరను దర్శించుకోవడాలు, ఇంట్లో కుల దేవత పూజలు, అన్ని మాయమవుతున్నాయి, ఇప్పుడు నాలుగు కిలోమీటర్లు నడిచే ఓపిక, సమయం ఎవరికీ లేదు ప్రతివారు చేతిలో వాచీ చూసుకొని టైం లేదు మరీ చాల బిజీ, ఆటో లు మొదలయ్యాయి బస్సులు కరువయ్యాయి, నా కిటికీ గేలరీ మూతపడింది.
పిల్లల చేసే అల్లరికి ప్రకృతి మాత మౌనంగ కొంగు అడ్డుపెట్టుకొని బాధ పడడం కళ్లారా కనిపించింది. అయిన ఏదో ఆశ, ఏదో అలజడి, ఒక కొత్త అనుబవం, ఒక కొత్త కోరిక ఎప్పుడు నా మనసును ఆ గ్రామా ప్రకృతి దేవత తన వైపుకు లాగుతుంటుంది. ఇప్పటికేమి మించిపోయింది ఏమి లేదని గ్రామా బ్యాంకు సహాయంతో వ్యవసాయశాక అధికారులు, వేప మందు పరిచయం చేసారు. మంచి పనులు చేయడానికి గ్రామా పెద్దలు ముందుకు రావడం కూడా ఆరోగ్యకరమైన విషయమే.
గ్రామానికేల్లి చాల రోజులయ్యింది. కొత్తగ తీసుకొన్న ప్రొఫెషనల్ కేమరకి ఇంకా ఆ గ్రామాన్ని పరిచయం చేయలేదు. మరో నాలుగు రోజులు వెళ్లి గడపాల్సిందే.
మెల్లిగ నెమరువేసుకున్న పుస్తకాన్ని మనసు లైబ్రేరి లో బద్రంగా పెట్టుకొని. అందమైన ఆలోచనల నుండి బయటపడి మల్లి రణగొణ ధ్వనులతో యుద్ధం సాగిస్తూ సికింద్రాబాద్ రేతిఫైల్ బస్సు స్టాప్ లోనుండి ఒకటో నెంబర్ బస్సెక్కి ఆఫీసు కి పయనం..